Friday, December 24, 2010

శుభాశ్శిస్సులు


హ్యాపీ బర్త్డే అమ్ము!! .. పుట్టిన రోజు శుభాకాంక్షలు రా సాహితి!!! హాయ్ బుజ్జి,ఇవాళ నీ బర్త్డే రా కన్నా!!
ఇలా ఎన్ని రకాలుగా మనం పిల్లలకి ఆశ్శిస్సులు ఇస్తామో కదా.. ఇంట్లో వాళ్ళు మనస్పూర్తిగా పిల్లలని దీవిన్చినట్టు ఇంక ఎవరు దీవిస్తారు అని నా ప్రశ్న?? . అలా ఇంట్లో వాళ్ళు కాక మనస్పూర్తిగా దీవించే వాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారేమో అని నా అభిప్రాయం

అసలు అమ్మా, నాన్న దీవించినా పిల్లలకి ఏమి తెలుస్తుంది.?? పిల్లలు అంటే ఇక్కడ నేను సంభోదించేది ఏడాది, రెండు ఏళ్ల లోపు పిల్లల గురించి.. కనీసం రెండు ఏళ్ల పిల్లలు కాకా పోయిన I am talking about 1 year young kids.. వాళ్ళకి మనం ఏమి మాట్లాడుతున్నామో , ఏమి అంటున్నామో స్పష్టం గా అర్థం కాదు. ఏదో తిట్ట కుండా అంటున్నాము అని తప్ప..  అలాగే ఆలోచిస్తే, బయటవాళ్ళు మనని wish  చేసినా , for that matter on any occasion,  వాళ్ళు మనకి మనస్పూర్తిగా ఆశ్శిస్సులు అందిస్తున్నారా అన్నది అర్థం చేస్కోగలమా??  నాకు తెలిసి , దానికి సమాధానం , తెలియదు.. and తెలుస్కోలేము. ఏదో అందరం ఒకటే society లో ఉన్నాం కాదా, పిలవకపోతే, ఏమైనా అనుకుంటారేమో అని కొందరిని,  ఒక్కళ్ళ ని పిలిచి వేరే వాళ్ళని పిలవలేదు అని అనుకుంటారేమో అని ఇంకా కొంత మందిని పిలిచి, అలా మన శుభకార్యాలకు చాలా మందిని పిలుస్తూ ఉంటాము. అలా పిలవక పొతే శుభకార్యం చేసుకునే వాళ్లకి మర్యాద తెలియదు అని భావిస్తారు కూడా.. భావించడమే కదు, అలా అని అందరితో అంటూ, వేరే వాళ్ళ అభిప్రాయం కూడా మారుస్తూ ఉంటారు (అలా ఒకరి మాటమీద అభిప్రాయం మార్చుకునే వాళ్ళు మన చుట్టుపక్కల చాల మందే ఉన్నారు, ఉంటారు. నేను గమనించిన అంతవరుకు నాకు సమాజం మీద ఉన్న అభిప్రాయం అది)

పిల్లల విషయాలకి వస్తే, ఆ మాటకి వస్తే, ఏ శుభకార్యానికి అయినా మనకి బాగా తెలిసి, మనస్పూర్తిగా పిల్లల/మన  క్షేమం కోరే వాళ్ళు అని ఖచ్చితంగా తెలుస్తేనే పిలవాలి అని నా ఉద్దేశం.
మనం పిలిచే అతిధులని రెండు విభాగాలగా ఆలోచిస్తే, ఏమి అనుకోకుండా పిలిచారా , వచ్చామా, wishes చెప్పామా, తిన్నమ్మా,వెళ్లామా అని అనుకునే వాళ్ళతో ఏ సమస్య లేదు.. వాళ్ళ గోల ఏదో వాళ్లది.. వాళ్ళ వాల్ల మనకి ఏమి నష్టం కూడా లేదు.. సమస్య అల్లా ఆ రెండో రకం జనం వల్లే.. ఆలాంటి జనం, మన సమాజం లోనే కాదు, మన చుట్టాలు, బంధువుల్లో కూడా ఉంటారు (నాకు చుట్టాలకి, బంధువులకి తేడ తెలియదు.. తెలుస్కుంట తొందర్లో), వచ్చినందుకు అన్ని ఆరాలు తీస్తారు, మనం మొహమాటం కొద్ది కొన్ని విషయాలు చెప్పడం, దాని మీద వాళ్ళకి ఇంకా కొన్ని ప్రశ్నలు రావడం, అడగ లేక వాళ్ళకి తోచింది వాళ్ళు అనుకోవటం, కొంత వచ్చిన శుభకార్యం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది.. అంతటితో ఆగుతే బాగానే ఉంటుంది , అప్పుడు వాళ్ళ వల్ల కూడా సమస్య లేదు అని అనచ్చు. కాని వాళ్ళు అక్కడితో ఆగక, మనసులో అసూయా పెంచుకుంటారు. అసూయ కి కారణం - వాళ్ళ దెగ్గర లేదు అని కాక, మన దెగ్గర ఉంది అని.. లేదా వాళ్ళ దెగ్గర లేనిది మన దెగ్గర ఏదైనా ఉంటె అది ఉందని - .. అసూయ మోతాదు పెరిగి ద్వేషం గా మారుతుంది.. అసూయా, ద్వేషం మధ్య పరిస్తితిలో ఉన్నప్పుడు వాళ్ళకి, మనకి తెలిసిన common స్నేహాతులకి చెప్పడం, వాళ్ళల్లో ఉన్న రెండో రకం జనం వల్ల అలా అలా అందరికి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళు చెప్పు కుంటే సమస్య ఏంటి అని అనుకుంటున్నారా... వస్తున్నా అక్కడికే వస్తున్నా.
సైన్స్ గురించి చాలా తెలియక పోయినా, అందరికి ఏంతో కొంత తెలుసు కదా.. ఈ ప్రపంచం మొత్తం లో రెండు రకాల  శక్తులు ఉంటాయి/ఉన్నాయి అని almost అందరం నమ్ముతాం కదా.. అదే నండి మంచి, చెడు (లేదా బలం, బలహీనత) గురించి మాట్లాడుతున్నాను. Not sure if I conveyed the right meaning or not, I am trying to say about positive and negative energies that exist in this world. మన పురాణాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది కదా. అందుకే మంచికి రూపం దేవుళ్ళు అని, చెడుకి రూపం రాక్షసులు అని సంభోదిస్తాము. ఎప్పుడు అయితే చెడు ఎక్కువ అవుతుందో, అప్పుడు మనకి కష్టం వచ్చినట్టు భావిస్తాము. అలా జనుల అసూయా, ద్వేషం (negative thoughts, which inturn become negative energy) వల్ల వాటినుంచి తప్పించుకోటానికి మనకి తెలియకుండానే మనం కూడా ఆ చెడు తో సావాసం చేస్తాం(it may be out of frustration for not getting the results even after we followed the right path all the way till date) .. అలా చెయ్యడం వల్ల మనకి మనం చెడు  చేస్కుంటూ వేరేవాళ్ళకి కూడా చెడు చేస్తాము/చేస్తున్నాం.

దీని అంతటికి కారణం, మనం చేసేది సబబా (correcta) లేదా అని ఆలోచించకుండా మన చుట్టూ ఉన్న సమాజం కోసం ఆలోచించటం వల్ల, అని నా అభిప్రాయం.. అలా అని ఎవరి గురించి ఆలోచించకుండా  నా  సంగతి ఏదో నేను చూస్కుంటా చాలు అని ఉండాలి అని నా ఉద్దేశం కాదు, ఏది మంచో , ఏది చేడో ఆలోచించే శక్తి తెచ్చుకొని, ఆ శక్తి ని వాడుతూ దాని ప్రకారం నడుచుకుంటే మంచిది అని నా అభిప్రాయం. అలా చెయ్యడం వల్ల  మనకి మంచి జరుగుతుంది అండ్ ఎదుటి వారికి  కూడా  ఎంతో కొంత మంచి జరుగుతుంది.

శుభకార్యాలకు అందరిని పిలిచి భోజనాలు పెడితే మంచిది అంటారు కదా అని ఏమైనా ప్రశ్న మిగిలి ఉంటే, నాకు తోచి అండ్ తెలిసి, నిజంగా మీరు మంచే చేయ్యదలుచు కుంటే, మన సమాజం లో మరియు ఈ ప్రపంచం లో తిండి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు.. వాళ్ళకి సహాయం చేద్దాం , వాళ్ళని పిలిచి మన శుభకార్యాలకు భోజనం పెడదాం, వాళ్ళ ఆకలి తీరుద్దాం. అలా చెయ్యడం వల్ల పుణ్యం పురుషార్ధం రెండు ఉంటాయి. వాళ్ళ ఆకలి తీరినందుకు వాళ్ళు మనకి మంచి జరగాలి అని శుభం ఆశిస్తారు , లేక పొతే కనీసం సాధారణం గా ఉంటారు అంతే కదా , మన మీద ఆసూయ, ద్వేషాలు  పెంచుకోరు కదా..  

ఒక్క సారి ఆలోచించండి, మన కోసం మనం బతుకుతూ , అవసరం అయిన వాళ్ళకి సహాయం చేద్దామా or సమాజం కోసం మనం బతుకుదామా?? ఎవరికీ ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి వాళ్ళు మంచి, చెడు అలోచించి చేస్తే అదే చాలు.

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Good one. Nice blog on your first attempt. what you said is correct.
    keep continue writing more blogs and be a "Prerana" for others.

    ReplyDelete